Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం : నిధులు జమ చేసిన సీఎం జగన్

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు చేయూతనిచ్చేలా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించనుంది. 45 యేళ్ల నుంచి 60 యేళ్లలోపు వారికి ఈ పథకం వర్తింపజేస్తారు. మొత్తం 3,92,674 మంది పేద మహిళలకు 589 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారు. 
 
మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఒక్కో ఈబీసీ మహిళకు రూ.15 వేలు చొప్పున మూడేళ్ళలో 45 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. 
 
ఇప్పటికే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇందులోభాగంగా, ఇపుడు కొత్తగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పేరుతో సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments