Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థనలు రద్దు

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇకపై పాఠశాలల్లో ఉదయం పూట ప్రార్థనలు నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, స్కూల్స్‌లలో క్రీడా పోటీలు కూడా నిర్వహించవద్దని కోరింది. 
 
ముఖ్యంగా, విద్యార్థులను తరగతి గదుల్లో భౌతికదూరం పాటించేలా కూర్చోబెట్టాలని, పాఠశాల ప్రాంగణంలో ఎక్కడా కూడా గుమికూడకుండా చూడాలని ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అధికారులు కోరారు. మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటించేలా చూడాలని కోరింది. 
 
అలాగే పాఠశాల గదులను, ఆవరణను ఎప్పటికపుడు శానిటైజ్ చేయాలని ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుండాలని కోరింది. అదేసమయంలో విద్యార్థులు ఎవరైనా కరోనా వైరస్ బారినపడితే తక్షణం చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments