Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాగులోపడిన ఆర్టీసీ బస్సు - మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (15:40 IST)
వెస్ట్ గోదావరి జిల్లా జల్లేరు వాగులో బుధవారం ఆర్టీసీ బస్సు ఒకటి అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తొలుత పది మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. కానీ, ప్రభుత్వం వెల్లడించిన వివరాల మేరకు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు. ఈ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అలాగే, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. 
 
జల్లేరు వాగులోపడిన బస్సు 
పశ్చిమ గోదావరి జిల్లాలోని జల్లేరు వాగులో ఆర్టీసీ బస్సు వాగులోపడిన ఘటనలో పది మంది వరకు మృత్యువాతపడ్డారు. ఈ బస్సు వంతెనపై వెళుతుండగా, నియంత్రణ కోల్పోయిన వాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మృతి చెందగా, ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 
 
కాగా, బస్సు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నుంచి జంగారెడ్డి గూడెంకు వెళుతుండగా జల్లేరు వాగులో ప్రమాదవశాత్తు పడిపోయింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments