మరో సీనియర్ ఐఎఎస్ పైన దృష్టి పెట్టిన సిఎం... ఎవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (18:56 IST)
ఎపి సిఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసి చర్చకు తెరలేపారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా సిఎం మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారట. అది కూడా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ టిటిడి కార్యనిర్వహణాధికారిని మార్చాలని నిర్ణయానికి వచ్చేశారట. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన ఈయన డిప్యుటేషన్ పైన టిటిడి ఈఓగా వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఐదు నెలల పాటు ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కానీ తిరుమల ప్రత్యేక అధికారి పోస్టును మాత్రం మార్చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పోస్టును కట్టబెట్టారు.
 
ప్రస్తుతం ఈఓ పోస్టును కూడా అదేవిధంగా సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌కు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారట సిఎం. త్వరలోనే దీనికి సంబంధించిన జిఓ కూడా వెలవడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా కీలక పోస్టుల్లో ఉన్న ఐఎఎస్‌లను సిఎం మారుస్తూ వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments