Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సీనియర్ ఐఎఎస్ పైన దృష్టి పెట్టిన సిఎం... ఎవరు?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (18:56 IST)
ఎపి సిఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసి చర్చకు తెరలేపారు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి. తాజాగా సిఎం మరో నిర్ణయం కూడా తీసేసుకున్నారట. అది కూడా ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ టిటిడి కార్యనిర్వహణాధికారిని మార్చాలని నిర్ణయానికి వచ్చేశారట. తెలుగుదేశం పార్టీ హయాంలో టిటిడి ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. 
 
మహారాష్ట్రకు చెందిన ఈయన డిప్యుటేషన్ పైన టిటిడి ఈఓగా వచ్చారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా ఐదు నెలల పాటు ఈఓగా అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నారు. కానీ తిరుమల ప్రత్యేక అధికారి పోస్టును మాత్రం మార్చేశారు. గతంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న ధర్మారెడ్డికి ఆ పోస్టును కట్టబెట్టారు.
 
ప్రస్తుతం ఈఓ పోస్టును కూడా అదేవిధంగా సీనియర్ ఐఎఎస్ అధికారి జెఎస్వీ ప్రసాద్‌కు అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నారట సిఎం. త్వరలోనే దీనికి సంబంధించిన జిఓ కూడా వెలవడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుసగా కీలక పోస్టుల్లో ఉన్న ఐఎఎస్‌లను సిఎం మారుస్తూ వస్తుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చకు దారితీస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments