Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రైతులకు పెట్టుబడి సాయం - బటన్ నొక్కనున్న సీఎం జగన్

Webdunia
శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (09:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద నిధులను జమచేయనుంది. తాజా సీజన్ కోసం సెప్టెంబరు ఒకటో తేదీన మొదటి విడత పెట్టుబడి సాయం కింద ఈ నిధులను అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రూ.109.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
నిజానికి ఈ కార్యక్రమం ఆగస్టు 31వ తేదీన జరగాల్సివుంది. కానీ, ఆర్థిక శాఖ ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ - వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు రైతులకు ఏటా రూ.7500 పెట్టుబడి సాయం కింద అందిస్తుంది. 
 
ఇది మూడు విడతల్లో అందజేస్తున్న విషయం తెల్సిందే. 2023-24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి తొలి విడత సాయాన్ని నేడు అందించనున్నారు. ఇందుకోసం రూ.109.74 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద 1.46 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments