Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ కుటుంబంలో ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా సీఎందే బాధ్యత

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (09:13 IST)
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారని, దానిని తట్టుకోలేకనే అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నంకు  పాల్పడిందన్నారు.
 
పోలీసులు పులివెందుల ఫ్యాక్షన్ ముఠా సభ్యుల్లా వ్యవహరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ కోసం ఇంకెంతమంది మైనార్టీలను బలిగొంటారని నిలదీశారు. 
 
ఆత్మహత్యాయత్నం చేసిన అక్బర్ బాషా కుటుంబంలోని ఏ ఒక్కరి ప్రాణాలకు ప్రమాదం జరిగినా, సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు. జగన్ బంధువు తిరుపాల్ రెడ్డి అక్బర్ బాషా భూమిని కబ్జా చేస్తే, ఎన్​కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించటం దారుణమని మండిపడ్డారు. బాషా భూమి తిరిగిచ్చేశామని, వివాదం సమసిపోయిందని జగన్ బృందం నమ్మించి మోసం చేశారన్నారు. బాషా కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments