Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (13:44 IST)
మూడు రోజుల జిల్లా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి విజయవాడకు బయలుదేరారు. జగన్ మోహన్ రెడ్డికి శనివారం కడప విమానాశ్రయంలో జిల్లా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 
 
 
శనివారం ఉదయం పులివెందులలో క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న ఆయన  అనంతరం హెలికాఫ్టర్ లో ఉదయం 11.25 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో 11.35 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటుతో పాటు ఆయన ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డిలు ఉన్నారు. 

 
కడప విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు పలికిన వారిలో   జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, డిఐజీ వెంకట్రామిరెడ్డి లతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానమ్, ఎమ్మెల్సీలు డిసి గోవిందరెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, రఘురామిరెడ్డి, డా.సుధ, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు అంబటి కృష్ణారెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, వైసీపీ నేత మాసీమ బాబు, జేసీలు గౌతమి (రెవెన్యూ), సాయికాంత్ వర్మ (అభివృద్ధి) గౌతమి, ధ్యానచంద్ర (హౌసింగ్), డిఎస్పీ వెంకట శివారెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments