Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా వాడేస్తోంది: ప్రధానికి ఏపీ సీఎం ఫిర్యాదు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (18:44 IST)
ఏపీ-తెలంగాణ జల వివాదాలపై ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరోమారు లేఖ రాశారు. పదేపదే జలశక్తి శాఖకు, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణా వాడేస్తోందని దీన్ని తక్షణం ఆపేలా చర్యలు చేపట్టాలని లేఖలో ముఖ్యమంత్రి జగన్ కోరారు. 
 
ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి తెలంగాణా రాష్ట్రం అక్రమంగా నీటిని వాడేయటం వల్ల ఏపీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని జగన్ ప్రస్తావించారు. ప్రాజెక్టుల్లో తెలంగాణా రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం వల్ల విలువైన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు.
 
ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి పంపకాల విషయంలో కృష్ణా నదీయాజమాన్య బోర్డు, అపెక్స్ కౌన్సిల్ లాంటి యంత్రాంగాలు ఉన్నప్పటికీ తెలంగాణా యధేచ్చగా నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని లేఖలో సీఎం పేర్కోన్నారు. 
 
తక్షణం తెలంగాణా చేస్తున్న నీటి వినియోగాన్ని నిలువరించకపోతే ఏపీ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని లేఖలో జగన్ ప్రధానికి తెలిపారు. విభజన చట్టం ప్రకారం హక్కుగా ఏపీకి చెందాల్సిన నీటి వాటా విషయంలో నష్టపోవాల్సి వస్తుందని సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
 
సాగునీటికి సంబంధించిన అవసరాలు ఉన్నప్పటికీ తెలంగాణా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటం రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల దిగువన నీటిని ఏపీ వినియోగించుకోలేదని తెలిసీ తెలంగాణా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటం దారుణమని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఆరోపించారు. 
 
జూన్ 1 తేదీ నుంచి 26 టీఎంసీల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తే అందులో 19 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వాడేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులపై కెఆర్ఎంబీతో పాటు సీఐఎఎస్ఎఫ్ రక్షణ కల్పించేలా ఆదేశించాలని ప్రధాని మోదిని ముఖ్యమంత్రి జగన్ లేఖలో కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments