Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ భక్తులుగా ముద్రపడిన అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్!

ఠాగూర్
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (19:25 IST)
గత ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరభక్తులుగా ముద్రపడిన అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి వారు తమ ప్రభుత్వంలో పని చేయడం ఇష్టం లేకుంటే ఉద్యోగాలు మానేసి ఇంటికి వెళ్లిపోవాలని అన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్న సమయంలో ఇలాంటి పోకడలను సహించేది లేదని హెచ్చరించారు. 
 
కాగా, వరద సహాయక చర్యల్లో అలసత్యం ప్రదర్శిస్తున్న అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అలవాటైన అలసత్వాన్ని వదిలించుకోవాలని లేకపోతే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. 
 
అధికారుల తీరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా ఉండాలన హితవు పలికారు. వరద సహాయక చర్యల్లో తానే స్వయంగా రంగంలోకి దిగానని, అయినా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. కావాల్సినంత ఆహారాన్ని తెప్పించినా దానిని పంపిణీ చేయడంలో జరిగిన జాప్యంపై మండిపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన అనంతరం అధికారులతో సీఎం బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల వ్యవహారశైలి, అలసత్వంపై మండిపడ్డారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments