Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రిపదవులు మనకక్కర్లేదు: నేతలతో చంద్రబాబు

అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న రెండు మంత్రి పదవులూ అక్కర్లేదని ఆయన స్పష్టంచేశారు.

Webdunia
శనివారం, 3 మార్చి 2018 (10:46 IST)
అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో ఉన్న రెండు మంత్రి పదవులూ అక్కర్లేదని ఆయన స్పష్టంచేశారు. కేంద్రం అన్యాయం చేస్తున్నా మంత్రి పదవుల్లో వేలాడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఎంపీ మురళీమోహన్‌ అన్నప్పుడు సీఎం పై విధంగా స్పందించారు.
 
అసలు మనకెందుకా మంత్రి పదవులు? అవేమైనా ప్రధాన శాఖలా? వాటివల్ల ఏమొచ్చింది? వాటిని పట్టుకుని మనం వేలాడడమేంటి? అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు జోక్యం చేసుకుని, ఆదేశిస్తే తక్షణం రాజీనామా లేఖ సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. 
 
అంతేకాకుండా, పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ఆర్థిక బిల్లులో నవ్యాంధ్రకు న్యాయం చేసే అంశాలేవీ లేకుంటే... ఏం చేయాలనే అంశంపై అప్పటికప్పుడు డైనమి‌క్‌గా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్రానికి చట్టబద్ధంగా చేయాల్సిన సాయంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని తీర్మానించింది. 'ఇది చివరి బడ్జెట్. ఇప్పుడు కూడా నిధులు కేటాయించకుండా, చేస్తాం, చూస్తాం అంటే నమ్మే పరిస్థితి లేదు అని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments