Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైకిల్ దూకుడు తగ్గించండి... చంద్రబాబుకు గవర్నర్ సూచన

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ సూచన చేశారు. కేంద్రంపై దూకుడు ఎంతమాత్రం తగదంటూ హితవు పలికారు. కేంద్రంతో సామరస్యంతో ముందుకు సాగాలాని

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (09:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఓ సూచన చేశారు. కేంద్రంపై దూకుడు ఎంతమాత్రం తగదంటూ హితవు పలికారు. కేంద్రంతో సామరస్యంతో ముందుకు సాగాలాని ఆయన కోరినట్టు సమాచారం.
 
ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్‌లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటుతున్న విషయం తెల్సిందే. ఈనేపథ్యంలో ఈ రాజకీయ వేడిని చల్లార్చాలని కాస్త స్పీడు తగ్గించాలని స్వయానా రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించినట్లు తెలిసింది. కేంద్రంతో సామరస్యమే మేలని.. ఢిల్లీతో సంబంధాలు బాగుంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన అన్నట్లు సమాచారం. 
 
విశాఖపట్నం పర్యటనకు వెళ్లిన గవర్నర్‌.. శనివారం రాత్రి హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అవ్వాల్సి ఉండగా.. మనసు మార్చుకుని రాత్రికిరాత్రే రైలులో విజయవాడ చేరుకున్నారు. గేట్‌వే హోటల్లో బసచేశారు. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, తిరుపతిలో తలపెట్టిన భారీ బహిరంగ సభ, హోదాపై బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తుచేస్తామని సీఎం ఇదివరకే ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ఆదివారం ఏకాంతంగా సమావేశమైన వీరిద్దరూ గంటా 40 నిమిషాల పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కేంద్రం-రాష్ట్రం మధ్య నెలకొన్న పరిస్థితులు, కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు తదితర అంశాలపై మాట్లాడుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments