Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనున్నాననీ... మీకేం కాదనీ....

నిస్సహాయక స్థితిలో వున్న రోగులకు నేనున్నానని భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వివేక్ గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. వైద్యం కోసం విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరగా రూ. 3

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (13:17 IST)
నిస్సహాయక స్థితిలో వున్న రోగులకు నేనున్నానని భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వివేక్ గుండె సంబంధిత సమస్యతో ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. వైద్యం కోసం విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చేరగా రూ. 3 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దినసరి కూలితో జీవనం సాగించే వివేక్ తల్లిదండ్రులు అంత మొత్తం భరించలేని స్థితిలో వున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉండవల్లి ప్రజావేదిక మంగళవారం కలిసి తమ పరిస్థితి వివరించారు. పిల్లవాడి పరిస్థితిని చూసిన సీఎం చలించిపోయారు. వెంటనే వివేక్ వైద్యానికయ్యే రూ. 3 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. 
 
అలాగే కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన ఉప్పులూరి రామానుజమ్మ బోన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వైద్యానికి డబ్బులు లేక ఇబ్బందిపడుతోంది. ఓవైపు పేదరికంతో మరోవైపు అనారోగ్యంతో ఆమె దీనావస్థలో వుంది. దీంతో మంగళవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద సీఎంని కలిసి రామానుజమ్మ తన పరిస్థితిని వివరించగా సీఎం వెంటనే స్పందించి ఆమె వైద్యానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం అందించారు. 
 
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన విజయవాడకు చెందిన టి. రాజాకుమార్, టి. రజని కుమారిలు వారి అమ్మమ్మ గురవమ్మ దగ్గర పెరుగుతున్నారు. అమ్మమ్మకు వచ్చే వితంతు పింఛనుతో జీవనం సాగిస్తున్నారు. గురవమ్మ మనవడు, మనవరాలిని చదివించలేక నానా అవస్థలు పడుతోంది. ఎలాగైనా తన మనవడు, మనవరాలికి మంచి చదువులు చెప్పించి ప్రయోజకులు చేద్దామనుకుంటే ఆర్థిక స్థోమత లేక అర్థాంతరంగా చదువు మాన్పించే పరిస్థితి. ఈ సమయంలో తన గోడు చెప్పుకునేందుకు మంగళవారం నాడు సీఎం చంద్రబాబును కలిసి వివరించింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం ఆమెకు రూ. 50 వేలు ఆర్థిక సాయం మంజూరు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments