Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఒడిపై నకిలీ ట్వీట్ షేరింగ్ - టీడీపీ మహిళా నేతకు నోటీసులు

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా నేత గౌతు శిరీషకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులు జారీచేశారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిదని, ఈ యేడాది ఆ రెండు పథకాలకు డబ్బులు అందవంటూ ప్రభుత్వ చిహ్నంతో ఉన్న ఓ నకిలీ పోస్టును ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ నకిలీ పోస్టును పెట్టిన వారిని వదిలివేసి.. దాన్ని షేర్ చేసిన టీడీపీ మహిళా నేత శిరీషకు సీఐడీ పోలీసులు ఇపుడు నోటీసులు పంపించడం గమనార్హం. 
 
పైగా, సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని అందులో కోరారు. ఇదిలావుంటే, ఇదే తరహా ఆరోపణలపై టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడు, టెక్కలి నియోజకవర్గ ఐటీడీసీ కోఆర్డినేటర్ అప్పిని వెంకటేష్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆయన వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించి పంపించి వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments