Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

Webdunia
గురువారం, 2 నవంబరు 2023 (19:24 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసులు నమోదు చేయగా, తాజాగా నమోదు చేసిన కేసుతో కలిసి చంద్రబాబుపై నమోదు చేసిన కేసుల సంఖ్య ఐదుకు చేరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని ఏపీ ఎండీసీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. 
 
ఇందులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమామహేశ్వర రావు పేర్లను చేర్చారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా వ్యవహరించారని ఏపీఎండీసీ చేసిన ఫిర్యాదును సీఐడీ స్వీకరించింది. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న చంద్రబాబుపై ఇది ఐదో కేసు కావడం గమనార్హం. 
 
కాగా, చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం అనుమతుల మంజూరు కేసులను నమోదు చేసిన విషయం తెల్సిందే. వీటిలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయగా, మొత్తం 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై ఆయన బుధవారం విడుదలైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రబాబుని కలిసి చెక్కుని అందజేసిన డా. మోహన్ బాబు, విష్ణు మంచు

కార్తీ, అరవింద్ స్వామి పాత్రల్లోకి తొంగిచూసేలా చేసిన సత్యం సుందరం చిత్రం రివ్యూ

జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారా? ఆయేషా ఏమంటున్నారు...

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments