Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా? వేమూరి ఆనంద్ సూర్య

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:15 IST)
బడ్జెట్‌లో బ్రాహ్మణులకు రూ.1000 కోట్లు  కేటాయిస్తామన్నవారు ఇప్పుడేం సమాధానం చెప్తారు? మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీ నాయకుల నైజం అని మరో సారి నిరూపితమైందని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య ఆరోపించారు. 
 
శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ, బ్రాహ్మణులకు రూ.1000 కోట్ల కేటాయింపులు జరుగుతాయని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింపిందని ఆరోపించారు. 
 
రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయని ఊదర గొట్టిన 'వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు బ్రాహ్మణులకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? గౌరవ ఉప సభాపతిని ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ సంఘాలు సన్మానించినపుడు, వారిచ్చిన హామీ రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయన్నది నిజం కాదా? తప్పుడు హామీలు ఇవ్వడం వైసీపీ పార్టీ  నాయకులకు అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓట్‌‌ఆన్‌‌ఎకౌంట్‌ బడ్జెట్‌లోనే బ్రాహ్మణులకు రూ.100 కోట్లు కేటాయించారు. కానీ ఆ వంద కోట్లు వైసీపీ ప్రభుత్వమే కేటాయించినుట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు నిజంగా మాటమీద నిలబడే వారయితే నిరుపేద బ్రాహ్మణులకు వారి నిజమైన సంక్షేమానికి రూ.1000 కోట్లు వెంటనే కేటాయింపు జరపాలని వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments