Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాట తప్పం.. మడమ తిప్పం అంటే ఇదేనా? వేమూరి ఆనంద్ సూర్య

Webdunia
శనివారం, 13 జులై 2019 (06:15 IST)
బడ్జెట్‌లో బ్రాహ్మణులకు రూ.1000 కోట్లు  కేటాయిస్తామన్నవారు ఇప్పుడేం సమాధానం చెప్తారు? మాట తప్పడం, మడమ తిప్పడం వైసీపీ నాయకుల నైజం అని మరో సారి నిరూపితమైందని ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ మాజీ ఛైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య ఆరోపించారు. 
 
శుక్రవారం ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ, బ్రాహ్మణులకు రూ.1000 కోట్ల కేటాయింపులు జరుగుతాయని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో బ్రాహ్మణులకు మొండిచెయ్యి చూపింపిందని ఆరోపించారు. 
 
రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయని ఊదర గొట్టిన 'వైయస్‌ఆర్‌ పార్టీ నాయకులు బ్రాహ్మణులకు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? గౌరవ ఉప సభాపతిని ఈ మధ్య కాలంలో బ్రాహ్మణ సంఘాలు సన్మానించినపుడు, వారిచ్చిన హామీ రూ.1000 కోట్లు కేటాయింపులు జరుగుతాయన్నది నిజం కాదా? తప్పుడు హామీలు ఇవ్వడం వైసీపీ పార్టీ  నాయకులకు అలవాటుగా మారిపోయిందన్నారు. 
 
నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓట్‌‌ఆన్‌‌ఎకౌంట్‌ బడ్జెట్‌లోనే బ్రాహ్మణులకు రూ.100 కోట్లు కేటాయించారు. కానీ ఆ వంద కోట్లు వైసీపీ ప్రభుత్వమే కేటాయించినుట్లు చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు నిజంగా మాటమీద నిలబడే వారయితే నిరుపేద బ్రాహ్మణులకు వారి నిజమైన సంక్షేమానికి రూ.1000 కోట్లు వెంటనే కేటాయింపు జరపాలని వేమూరి ఆనంద్ సూర్య డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments