Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గుడ్డోడా కూర్చో' ... టీడీపీ ఎమ్మెల్సీపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (10:20 IST)
ఏపీ అసెంబ్లీతో పాటు.. శాసనమండలి సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాలు, అధికార పార్టీ సభ్యులు, విపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. ఈ మాటల యుద్ధం ఒక్కో సమయంలో అదుపుతప్పుతోంది. దీంతో విపక్ష సభ్యులను మంత్రులు తూలనాడుతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గుడ్డోడా కూర్చో అంటూ గద్దించారు. ఇది మంగళవారం జరిగిన సభా కార్యక్రమాల్లో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మంగళవారం శాసనమండలిలో పంచాయతీరాజ్‌ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తాను ప్రతిపాదించిన సవరణను వైవీబీ చదువుతూ.. ఈ బిల్లు ప్రభుత్వానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికే భయపడుతోందని.. ఈ బిల్లు ఇప్పుడెందుకన్నారు. దీంతో అనవసరమైన మాటలెందుకని మంత్రి వెలంపల్లి అన్నారు. 
 
వెంటే వైవీబీ స్పందిస్తూ 'ముందు సింహాలు ఏమయ్యాయో చూడు సామీ? రథం తగలబడింది పట్టించుకోలేదు.. ఇది పంచాయతీరాజ్‌కు సంబంధించింది.. నీ శాఖకు సంబంధం ఏంటి' అని ప్రశ్నించారు. దీంతో మంత్రి ఆగ్రహంతో 'గుడ్డోడా కూర్చో' అని వ్యక్తిగత దాడికి దిగారు. వైవీబీ కూడా మంత్రిని ఇడియట్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments