Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదేమి ఫిష్ మార్కెట్ కాదు.. ప్రజలు చూస్తున్నారు : తమ్మినేని సీతారాం

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (14:15 IST)
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ సభలో టీడీపీ సభ్యులు గీత దాటుతున్నారు. దీంతో సభాపతి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, విపక్షనేతలు మాట్లాడే సమయంలో అధికారపక్ష సభ్యులు నోరు మెదపడం లేదనీ, కానీ, సభానేత ముఖ్యమంత్రి మాట్లాడే సమయంలో విపక్ష సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడటం భావ్యంకాదని సుతిమెత్తగా హెచ్చరించారు. 
 
పైగా, సభ ఆర్డర్ తప్పుతుంటే తాను చూస్తూ మిన్నకుండిపోవడానికి ఇదేమి ఫిష్ మార్కెట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. సభానేత, విపక్ష నేతలు మాట్లాడే సమయంలో ఏ ఒక్క సభ్యుడు అడ్డు తగలవద్దని కోరారు. సభను తాను హుందాగా నడిపించాలని కోరుకుంటున్నానని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. సున్నా వడ్డీపై నిన్న జరిగిన చర్చలో తమపై నిరాధార ఆరోపణలు చేశారని, అందుకే నోటీసు ఇస్తున్నామని టీడీపీ తెలిపింది. అసత్యాలు మాట్లాడి, సభను పక్కదోవ పట్టించిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఇచ్చిన నోటీసులో పేర్కొంది. సున్నా వడ్డీపై గురువారం జరిగిన చర్చపై శుక్రవారం సమావేశాల్లో కూడా టీడీపీ చర్చను ప్రారంభించింది. మరోవైపు, సున్నా వడ్డీపై చర్చకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని జగన్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments