Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీలో రాజధానిపై రగడ : 9 మంది తెదేపా సభ్యుల సస్పెన్షన్

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (17:59 IST)
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాజధాని అమరావతి అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన పెద్ద రగడ జరిగింది. దీంతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సిపార్సు మేరకు... స్పీకర్ తమ్మినేని సీతారాం తొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేశారు. 
 
అమరావతి రాజధాని భూముల పేరు క్రయ విక్రయాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెదేపా పాల్పడిందంటూ వైకాపా సభ్యులు ఆరోపించారు. దీనికి తెదేపా సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆందోళనకు దిగారు. దీంతో, సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్పీకర్ ఎంతలా నచ్చజెప్పినా వారు శాంతించలేదు. 
 
దీంతో సభకు ఆటంకం కలిగిస్తున్న తెదేపా సభ్యులు నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, బెందాళం అశోక్, వీరాంజనేయస్వామి, మద్దాల గిరి, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్‌లను మంగళవారం ఒక్కరోజు మాత్రం సస్పెండ్ చేయాలంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం చేయడంతో, స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments