నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (11:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. కాగా, ఏపీకి కొత్త గవర్నరుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అబ్దుల్ నజీర్ అసెంబ్లీలో తొలి ప్రసంగం చేయనున్నారు. ఆయన పాల్గొనే తొలి అధికారిక కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే అసెంబ్లీ ఉభయసభలు వాయిదాపడతాయి. ఆ తర్వా శానససభ వ్యవహారాల కమిటీ (బీఏసీ) సమావేశమై సభ నిర్వహణపై ఒక షెడ్యూల్‌ను ఖరారు చేస్తుంది. ఈ బీఏసీ సమావేశం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరుగుతుంది. 
 
ఇందులో అసెంబ్లీ సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలి, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలను బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. మరోవైపు ఈనెల 24వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.60 లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లో సీఎం జగన్ పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments