Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీకి మరో షాక్, వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

Webdunia
శుక్రవారం, 28 ఆగస్టు 2020 (15:35 IST)
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరారు. శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రమేష్ బాబు పార్టీ కండువాను కప్పుకున్నారు. తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.
 
ఎంపీ విజసాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెందుర్తి నుంచి రమేష్ బాబు గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మంత్రి కన్నబాబుపై పోటీ చేసి ఓడిపోయారు. ఇక విశాఖ రాజధానిని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే  పార్టీకి రాజీనామా చేశారు.
 
ఇక మూడు రాజధానుల నిర్ణయానికి ఓకే చెబుతూ తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు పంచకర్ల రాకతో విశాఖలో వైసీపీ బలం మరింత పెరగనుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments