Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ 16 మంది ఐపీఎస్‌లకు షాక్... మెమోలు జారీ చేసిన ఏపీ డీజీపీ!!

ఠాగూర్
బుధవారం, 14 ఆగస్టు 2024 (14:40 IST)
గత వైకాపా ప్రభుత్వంలో వైకాపా మంత్రులు, అధికార నేతల ఒత్తిడికి తలొగ్గి అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ఐపీఎస్ అధికారులు ఎదురయ్యే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది. ప్రస్తుతం వెయిటింగ్‌ జాబితాలో ఉన్న పలువురు ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు మెమోలు జారీ చేశారు.
 
వెయిటింగ్‌లో ఉండి హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో లేనివారికి మెమోలు ఇచ్చారు. పీఎస్సార్‌ ఆంజనేయులు, సునీల్‌కుమార్‌ సహా 16 మందికి మెమోలు జారీ చేశారు. సంజయ్‌, కాంతిరాణా టాటా, కొల్లి రఘురామిరెడ్డి, అమ్మిరెడ్డి, విజయరావు, విశాల్‌ గున్ని, రవిశంకర్‌ రెడ్డి, రిషాంత్‌రెడ్డి, రఘువీరారెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జాషువా, కృష్ణకాంత్‌ పటేల్‌, పాలరాజుకు మెమోలు ఇచ్చారు. 
 
ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులోనే ఉండాలని ఆదేశించారు. విధులు ముగిశాక అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి రోజూ ప్రధాన కార్యాలయంలో రిపోటు చేయాలని డీజీపీ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, పైన పేర్కొన్న అధికారులు వైకాపా ప్రభుత్వంలో ఇష్టాను రీతిలో అఖిల భారత సర్వీసులకు విరుద్ధంగా నడుచుకుని ఇపుడు సమస్యలను ఎదుర్కొంంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments