Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం... నేడు కూడా మరికొన్ని రైళ్లు రద్దు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:26 IST)
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అక్టోబరు 31వ తేదీ మంగళవారం కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వీటిలో ప్రధాన రైళ్లుగా భావించే హౌరా - సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా - బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - హైదరాబాద్‌(18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 
 
అలాగే, తిరుపతి - పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస - విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి - విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ - గుణుపూర్‌(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments