Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం... నేడు కూడా మరికొన్ని రైళ్లు రద్దు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:26 IST)
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అక్టోబరు 31వ తేదీ మంగళవారం కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వీటిలో ప్రధాన రైళ్లుగా భావించే హౌరా - సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా - బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - హైదరాబాద్‌(18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 
 
అలాగే, తిరుపతి - పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస - విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి - విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ - గుణుపూర్‌(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments