Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం... నేడు కూడా మరికొన్ని రైళ్లు రద్దు

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (09:26 IST)
విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం దృష్ట్యా అక్టోబరు 31వ తేదీ మంగళవారం కూడా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. వీటిలో ప్రధాన రైళ్లుగా భావించే హౌరా - సికింద్రాబాద్‌(12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌, హౌరా - బెంగళూరు(12245) దురంతో ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌ - హైదరాబాద్‌(18045) ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. 
 
అలాగే, తిరుపతి - పూరీ(17480) ఎక్స్‌ప్రెస్‌, పలాస - విశాఖ (08531) ప్యాసింజర్‌, తిరుపతి - విశాఖ(08584) ప్రత్యేక రైలు, విశాఖ - గుణుపూర్‌(17240) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించారు. భువనేశ్వర్‌ - కేఎస్‌ఆర్‌ బెంగళూరు(18463) మధ్య నడిచే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను నేడు రీ షెడ్యూల్‌ చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. 
 
ఈ రైలు భువనేశ్వర్‌లో ఉదయం 5.40 గంటలకు బదులు ఉదయం 10 గంటలకు బయలుదేరేలా మార్పు చేశామని, ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించాలని కోరారు. ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించిన విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments