పునాదులు లేకుండానే గోడ నిర్మించిన కాంట్రాక్టర్...

ఠాగూర్
శనివారం, 3 మే 2025 (11:40 IST)
సింహాచలం ఆలయంలో చందనోత్సవ వేడుకల సందర్భంగా గోడకూలిన ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ సారథ్యంలో త్రిసభ్య కమిటీని నియమించగా, ఆ కమిటీ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
తాత్కాలిక గోడ నిర్మాణాన్ని పర్యవేక్షించేందకు ఇంజనీరింగ్ అధికారి ఎవరూ లేకపోవడంతో ఆమోదం కూడా లేకపోవడంతో పునాదులు లేకుండానే కాంట్రాక్టర్ గోడ నిర్మించాడు. పైగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రధానగా మొదటి నుంచి ఇప్పటివరకూ చేసిన ఓ ఒక్క పనికీ సరైన అనుమతులు లేవని విచారణలో వెల్లడైంది. 
 
తాత్కాలిక గోడ నిర్మాణం ఎందుకు చేపట్టారు. ఎవరు అనుమతిచ్చారు. ఎవరు పర్యవేక్షించారు అనే విషయాలకు స్పష్టమైన సమాధానం అధికారులు విచారణ కమిటీ ముందు చెప్పలేక పోయారు. అంతేకాకుండా మూడు అంతస్తులు నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ విషయంలోనూ ఎవరి అనుమతులు లేకుండానే ప్రాథమిక పనులు ప్రారంభించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ గోడకూలిన ఘటనలో పర్యాటక శాఖ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, కాంట్రాక్టర్ ఈ దుర్ఘటనకు బాధ్యులేనని ప్రాథమిక విచారణలో తేలింది. కింది నుంచి పైకి వరకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతా రాహిత్యంగా వ్యవహించినట్టు విచారణ కమిటీ నిర్ధారించింది. తప్పను ఒకరిపై మరొకరు తోసుకుంటా బాధ్యతల లేదని తప్పించుకునేలా వాదనలు వినిపిస్తున్నట్టు కమిటీ గుర్తించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments