Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త : 20న ఆర్జిత సేవా టిక్కెట్లు

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (08:25 IST)
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచనుంది. కరోనా నేపథ్యంలో రెండళ్ళ క్రితం ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడాన్ని తితిదే నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టిక్కెట్లను తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్  (tirupatibalaji.ap.gov.in) వెబ్‌సైట్ ద్వారా భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 
 
20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు సేవలకు సంబంధించిన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్లు దక్కించుకున్న వారి వివరాలను 22న ఉదయం 10 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పెడతారు. 
 
ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తారు. అలాగే, శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న భక్తులను ఆలయ ఆవరణలోనే తీర్థం, శఠారి అందిస్తూ వస్తుండగా, కరోనా నేపథ్యంలో దీన్ని రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ 25వ చిత్రం ‘భద్రకాళి’ నుంచి పవర్ ఫుల్ టీజర్ విడుదల

Surender Reddy: మళ్లీ తెరపైకి సురేందర్ రెడ్డి - వెంకటేష్ తో సినిమా మొదలైంది

మీ ప్రేమను కాపాడుకుంటూ ఇకపైనా సినిమాలు చేస్తా : కిరణ్ అబ్బవరం

నాని కి ఈ కథ చెప్పడానికి 8 నెలలు వెయిట్ చేశా : డైరెక్టర్ రామ్ జగదీష్

SS రాజమౌళి, మహేష్ బాబు షూటింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్న ఒడిశా ఉపముఖ్యమంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments