Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు యూనివర్శిటీ : సీఎం చంద్రబాబు

ఠాగూర్
ఆదివారం, 15 డిశెంబరు 2024 (16:40 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరజీవి వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీలో త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో తెలుగు విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో తాము నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు జిల్లా మార్చామని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్వగ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. 
 
నాటు పొట్టి శ్రీరాములు బలిదానంతోనే రాష్ట్రంలో భాషా సంయుక్త రాష్ట్రాల అవతరణకు బీజం పడిందని చెప్పారు. ఆ మహనీయుడ ప్రాణ త్యాగంతోనే తెలుగు రాష్ట్రం అవతరించిందన్నారు. సంకల్ప సిద్ధి కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన ఏకైక వ్యక్తి పొట్టి శ్రీరాములు అని సీఎం చంద్రబాబు కొనియాడారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని రాష్ట్రం మత్తం నింపాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments