Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (09:11 IST)
ఢిల్లీ పర్యటనలో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలు గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. తొలుత ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశమవుతారు. ఇందుకోసం ఆయన బుధవారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానితో సమావేశంకానున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సీఎం రేవంత్‌కు అపాయింట్మెంట్ ఇచ్చింది. అయితే, ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ప్రధానితో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జరిపే సమావేశాల్లో తమతమ రాష్ట్రాల్లోని సమస్యలను ఏకరవు పెట్టనున్నారు. ముఖ్యంగా, విభజన హామీలను తక్షణం అమలు చేయాలని, విభజన సమస్యలను పరిష్కరించాలని వారు కోరనున్నారు. 
 
తెలంగాణ సీఎం మాత్రం గత వారమే ప్రధానితో భేటీ కావాల్సి వుంది. కానీ, లోక్‌సభ సమావేశాల దృష్ట్యా అది వాయిదాపడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ఈ భేటీ జరుగనుంది. తెలంగాణాకు సంబంధించిన పలు అంశాలు, కేంద్రం నుంచి రావల్సిన అనుమతులు, లభించాల్సిన ఆర్థిక సహకారం, కేంద్ర పథకాల నిధుల విడుదలలో జాప్యం తదితర అంశాలను సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
 
ముఖ్యంగా, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బొగ్గు గనుల వేలం పాటల్లో సింగరేణికి భాగస్వామ్యం కల్పించడం, సైనిక్ స్కూల్ ఏర్పాటు, రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్రానికి అప్పగించడం, విభజన చట్టంలోని అపరిష్కృతంగా ఉండిపోయిన కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, గిరిజన వర్శిటీకి నిధుల కేటాయింపు తదితర అంశాలను ప్రధాని దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లనున్నారు. ఇదిలావుంటే, శనివారం నాడు హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments