Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (10:03 IST)
బంధువు అని నమ్మి సాయం అడిగినందుకు ఆ మానవమృగం బాలిక శీలంపై కాటేశాడు. 13 యేళ్ళ దివ్యాంగ బాలికపై బంధువు అత్యాచారం జరిపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 13 యేళ్ళ దివ్వాంగ బాలిక ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుకుంటోంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో శనివారం ఇంటికి వచ్చింది. 
 
సోమవారం నుంచి స్కూలు కావడంతో తన ఇంటి పక్కనే ఉండే వరుసకు మామ అయ్యే బొక్కా మరియదాసు అలియాస్ కోటేశ్వర రావుతో ఆ బాలికను హాస్టల్‌కు పంపించింది. కానీ, ఆ బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు హాస్టల్‌కు తీసుకెళ్లకుండా నకరికల్లు శివారు ప్రాంతమైన ఎన్నెస్సీ కాలువ కట్ట వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని తోటి స్నేహితురాళ్ళకు చెప్పింది. వారు బాలిక బంధువులకు సమాచారం చేరవేయగా, వారంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి పోక్సో చట్టాన్ని ప్రయోగించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments