Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి పాట రూ.20 లక్షలు.. అభ్యర్థి పాట రూ.58 లక్షలు... నికరంపల్లెలో వేలం పాట..

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టుల వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. ఈ పదవుల రేట్లు లక్షల్లో పలుకుతున్నాయి. తాజాగా ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట రూ.20 లక్షలతో మొదలై రూ.58 లక్షల వద్ద ముగిసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగో విడతలో జరుగనున్నాయి. అయితే, ఈ మండలంలోని నికరంపల్లె సర్పంచ్‌ పదవి కోసం తీవ్ర పోటి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
 
గ్రామ పెద్దలు మధ్యేమార్గంగా గ్రామ ప్రయోజనాల కోసంతోపాటు వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్‌ పదవికి వేలం పాట నిర్వహించారు. దేవుని పాటగా రూ.20 లక్షలతో ప్రారంభమైన పాట చివరకు రూ.58 లక్షలతో ముగిసింది. 
 
టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌ పదవిని కైవసం చేసుకున్నారు. మొత్తం 1750 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో ఆ డబ్బును దేవస్థానం, మసీదు, చర్చిలకు ఆయా సామాజిక వర్గాల ఓట్ల శాతం మేరకు వాటాలు వేసి చెల్లించేలా ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వేలం పాట జరిగినట్లు సమాచారం. అధికార పార్టీ నియోజకవర్గ నేతలు ఈ సంఘటనపై దృష్టి సారించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments