Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి పాట రూ.20 లక్షలు.. అభ్యర్థి పాట రూ.58 లక్షలు... నికరంపల్లెలో వేలం పాట..

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్టుల వేలం పాటలు జోరుగా సాగుతున్నాయి. ఈ పదవుల రేట్లు లక్షల్లో పలుకుతున్నాయి. తాజాగా ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలం పాట రూ.20 లక్షలతో మొదలై రూ.58 లక్షల వద్ద ముగిసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నాలుగో విడతలో జరుగనున్నాయి. అయితే, ఈ మండలంలోని నికరంపల్లె సర్పంచ్‌ పదవి కోసం తీవ్ర పోటి నెలకొంది. వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 
 
గ్రామ పెద్దలు మధ్యేమార్గంగా గ్రామ ప్రయోజనాల కోసంతోపాటు వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు సర్పంచ్‌ పదవికి వేలం పాట నిర్వహించారు. దేవుని పాటగా రూ.20 లక్షలతో ప్రారంభమైన పాట చివరకు రూ.58 లక్షలతో ముగిసింది. 
 
టీడీపీ మద్దతుదారుడు సర్పంచ్‌ పదవిని కైవసం చేసుకున్నారు. మొత్తం 1750 ఓట్లు ఉన్న ఈ పంచాయతీలో ఆ డబ్బును దేవస్థానం, మసీదు, చర్చిలకు ఆయా సామాజిక వర్గాల ఓట్ల శాతం మేరకు వాటాలు వేసి చెల్లించేలా ముందస్తు ఒప్పందం చేసుకున్నారు. ఆ మేరకు వేలం పాట జరిగినట్లు సమాచారం. అధికార పార్టీ నియోజకవర్గ నేతలు ఈ సంఘటనపై దృష్టి సారించినట్లు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments