Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (11:01 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంటే తెలంగాణాలో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉంది. గత వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఈ తీవ్రత పెరుగుతుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఎక్కువగా నమోదవుతున్నాయి. 
 
సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు చోట్ల వడగాల్పులు వీచాయి. మంగళ, బుధవారాల్లో కూడా వడగాల్పులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 20 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపింది. 
 
రానున్న రోజుల్లో ఏపీలోని విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కడప, ప్రకాశం జిల్లాల్లోని 153 మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments