ఉద్యోగుల ఐక్య పోరు - అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (12:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఐక్యమై ఆందోళనకు దిగారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో హోరెత్తించారు. అలాగే, మరికొందరు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అదేసమయంలో నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్టు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమవుతుంది. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా, పీఆర్సీతోపాటు సినిమా టిక్కెట్ల అంశంపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. 
 
అలాగే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ అధికమైపోతోంది. దీంతో కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, పాఠశాలలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రావొచ్చని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

Naresh Agastya: శ్రీవిష్ణు క్లాప్ తో నరేష్ అగస్త్య కొత్త చిత్రం ప్రారంభం

Mowgli 2025: రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్... వనవాసం సాంగ్ రిలీజ్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments