Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉద్యోగుల ఐక్య పోరు - అత్యవసరంగా ఏపీ కేబినెట్ భేటీ

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (12:28 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఐక్యమై ఆందోళనకు దిగారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడితో హోరెత్తించారు. అలాగే, మరికొందరు ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. అదేసమయంలో నాలుగు ఉద్యోగ సంఘాల నేతలు ఏకమై ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నట్టు హెచ్చరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం అత్యవసరంగా సమావేశమవుతుంది. ఇందులో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా, పీఆర్సీతోపాటు సినిమా టిక్కెట్ల అంశంపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం ఉంది. 
 
అలాగే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికీ అధికమైపోతోంది. దీంతో కరోనా వ్యాప్తి కట్టడి చర్యలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, పాఠశాలలను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చించి ఓ నిర్ణయానికి రావొచ్చని అధికారులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments