Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు కంపించిన భూమి

Webdunia
ఆదివారం, 7 మే 2023 (15:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను పసిగట్టిన ప్రజలు భయంతో తమ ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలకు ముందు భారీ శబ్దం వినిపించినట్టు స్థానికులు వెల్లడించారు. 
 
ఆదివారం ఉదయం జిల్లాలోని ముండ్లమూరు గ్రామంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. రెండు మూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వారు వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 
 
కాగా, ఇటీవలికాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూ ప్రకంపనలు చోటుచేసుకుంటున్న విషయం తెల్సిందే. ఈ యేడాది మార్చి నెలలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. దీంతో గ్రామంలోని పలు గృహాల గోడలకు బీటలు వారాయి. వీధుల్లో వేసిన సిమెంట్ రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా, పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో తరచుగా ఈ భూప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments