ఇకపై డిగ్రీ కోర్సుల్లో స్కిల్ డెవలప్‌మెంట్.. ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి...

Webdunia
మంగళవారం, 5 నవంబరు 2019 (16:59 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల సిలబస్ మారనుంది. డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ సిలబస్‌ను 2020-21 నుంచి అమలు చేయనున్నారు. 
 
సాధారణంగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి సిలబస్ మారుతుంది. గతంలో 2015-16లో సిలబస్ మార్చారు. ఇపుడు అంటే ఐదేళ్ల తర్వాత మరోసారి మార్పులకు రంగం సిద్ధమవుతోంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 
 
రాష్ట్రంలోని వర్సిటీలకు అనుబంధంగా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల్లో మార్పులు అమలు చేస్తారు. ఇప్పటికే అమల్లో ఉన్న చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం(సీబీసీఎ్‌స)లో భాగంగా డిగ్రీ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి(స్కిల్‌ డెవల్‌పమెంట్‌)కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. 
 
మూడేళ్ల రెగ్యులర్‌ డిగ్రీ కోర్సులైన బీకాం, బీఎస్సీ, బీఏలతో పాటు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ను చేసేందుకు విద్యార్థులకు అవకాశం కలగనుంది. డిగ్రీతో సమాంతరంగా ఈ కోర్సును ఎంచుకునే విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ చేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నారు.
 
ఈ దిశగా డిగ్రీ సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. డిగ్రీ చదువుతూనే.. తనకు ఆసక్తి ఉన్న స్కిల్స్‌పై సదరు విద్యా సంస్థలో అందుబాటులో లేకుంటే మరో కాలేజీ లేదా విద్యా సంస్థలో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కోర్సు చేసేందుకు వెసులుబాటు కల్పించే విషయమై చర్చ జరుగుతోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Raghu Kunche: గేదెల రాజు చిత్రంలో హీరోలు, విలన్స్ ఉండరు. పాత్రలు మాత్రమే ఉంటాయి

Thiruveer: పాపం ప్రతాప్ అన్నవాళ్లతో వీర ప్రతాప్ అనిపించుకుంటా : తిరువీర్

మేఘాంశ్ శ్రీహరి హీరోగా థ్రిల్లర్‌ కాన్సెప్ట్ తో ఆస్మాన్ చిత్రం ప్రారంభం

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments