Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే నాలుగేళ్ళలో ఒక్క మద్యం షాపు ఉండదు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (11:40 IST)
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే అనేక షాపులను రద్దు చేసింది. తాజాగా మరో 13 శాతం షాపులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంటే గత యేడాది కాలంలో ఇప్పటివరకు 33 శాతం మేరకు మద్యం షాపులు తొలగించనట్టయింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తోంది. వాటిని 2,965కు తగ్గించింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రాగానే, 20 శాతం మేరకు షాపులను రద్దు చేశారు. ఇప్పుడు మరో 13 శాతం షాపులు తగ్గడంతో, యేడాది వ్యవధిలో 33 శాతం షాపులు తగ్గినట్లయింది. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో మద్యం కనిపించకుండా చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, మందుబాబులను మద్యానికి దూరం చేయడానికి వీలుగా ఇటీవల ఏకంగా 75 శాతం మేరకు మద్యం ధరలు పెంచిన విషయం తెల్సిందే. అయినప్పటికీ.. ఏపీలో మద్యం విక్రయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments