Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు జమ

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2800 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్మును 49,43,590 రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి యేడాది రూ.13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. ఇందులోభాగంగా, తొలివిడతలో గత నెలలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.875 కోట్లను జమ చేశారు.
 
ఇపుడు మరో రూ.5500 చొప్పున ప్రతి రైతుకు జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ.7500 జమ చేసినట్టు అవుతుంది.
 
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నగదు జమ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments