Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు జమ

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ నగదు రైతుల ఖాతాల్లో జమకానుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూ.2800 కోట్లను విడుదల చేసింది. ఈ సొమ్మును 49,43,590 రైతుల ఖాతాలకు బదిలీ చేయనున్నారు. 
 
వైఎస్ఆర్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు ప్రతి యేడాది రూ.13,500 సాయం చేస్తున్న సంగతి విదితమే. ఇందులోభాగంగా, తొలివిడతలో గత నెలలో ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.875 కోట్లను జమ చేశారు.
 
ఇపుడు మరో రూ.5500 చొప్పున ప్రతి రైతుకు జమ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.2,800 కోట్లను విడుదల చేసింది. అంటే తొలివిడతగా మొత్తం రూ.7500 జమ చేసినట్టు అవుతుంది.
 
శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ నగదు జమ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, ఎన్నికల హామీ మేరకు వరుసగా రెండో ఏడాది అన్నదాతలకు సాయం అందించేలా వైఎస్ జగన్ నిధులను విడుదల చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే, ఈ సంవత్సరంలో లబ్దిదారుల సంఖ్య 2.74 లక్షలు పెరిగింది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments