Webdunia - Bharat's app for daily news and videos

Install App

26 మందిని జలసమాధి చేసిన చెయ్యేరు వాగు : ఏపీ ప్రభుత్వం వెల్లడి

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (14:25 IST)
కడప జిల్లాలోని చెయ్యేరు వాగులో గల్లంతైన 26 మంది జలసమాధి అయినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వాగులో మృత్యువాతపడిన 26 మృతదేహాల్లో శనివారం 12, ఆదివారం 5 మృతదేహాలను వెలికి తీశారు. మరో గుర్తు తెలియని శవాన్ని కూడా గాలింపు బృందం కనుగొంది. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా మరో 17 మంది గల్లంతయ్యారు. 
 
చెయ్యేరు వాగులో జలసమాధి అయిన మృతదేహాల్లో 15 దేహాలను వెలికితీసి వారివారి కుటుంబ సభ్యులు లేదా బంధువులకు అప్పగించడం జరిగింది. ఈ మృతులంతా కడప జిల్లాలోని చెయ్యేరు వాగు సమీప గ్రామాలైన మండపల్లి, పులపత్తూరు, గుంట్లూరు గ్రామాల వాసులు ఉన్నారు. 
 
కాగా, ఈ నెల 19వ తేదీన కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని చెయ్యేరు వాగులో ఉన్న శివాలయంలో పూజలు చేసేందుకు వెళ్లినపుడు వాగులో ఒక్కసారిగా వరద రావడంతో వీరంతా గల్లంతైన విషయం తెల్సిందే. అయితే, ఈ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఇంకా ఆర్థిక సాయాన్ని ప్రకటించలేదు. 
 
కాగా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాలకు విస్తారంగా వర్షాలు కురిసిన విషయం తెల్సిందే.  వర్షాల దెబ్బకు భారీ స్థాయిలో వరద నీరు అనేక ప్రాంతాలను ముంచెత్తింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments