Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ బాదుడే.. బాదుడు.. : ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యం రూ.3,763.33 కోట్లు

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (09:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను ఆదాయ సేకరణకు సంబంధించిన భారీ లక్ష్యాలతో ముందడుగు వేస్తుంది. ఈ యేడాది భారీ మొత్తంలో పన్ను వసూళ్లను రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. పాత బకాయిలతో కలిసి 2023-24 సంవత్సరానికిగాను రూ.3,763.33 కోట్ల ఆదాయ సేకరణ లక్ష్యాన్ని పురపాలక శాఖ నిర్ణయించింది. ఈ మొత్తంలో ప్రైవేటు ఆస్తుల నుంచి రూ.1970.96 కోట్లు వసూలు చేయాలని నగర, పురపాలక, నగర పంచాయతీల వారీగా లక్ష్యాలను నిర్ధేశించింది. ఈ వివరాలను పురపాలక శాఖ వెబ్‌సైట్ డ్యాష్‌బోర్డులో అధికారులు గురువారం ఉంచారు. 
 
అయితే, కొత్త ఆర్థిక సంవత్సరంలో పెంచిన ఆస్తి పన్ను  వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా పురపాలక శాఖ గోప్యతను పాటిస్తూ వచ్చింది. దీనిపై పలు పత్రికల్లో మీడియా కథనాలు వచ్చాయి. దీంతో అధికారులు స్పందించారు. మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధింపు విధానం అమలులోకి వచ్చాక పుర, నగరపాలక సంస్థలు, పంచాయతీలు ఆస్తి పన్నును ఏటా 10 నుంచి 15 శాతం మేరకు పెంచుతున్న విషయం తెల్సిందే. కాగా, గత యేడాది పాత బకాయిలతో కలిపి రూ.2,007.39 కోట్లను వసూలు చేశారు. పన్ను చెల్లించేంతవరకు ప్రజలను పట్టి పీడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments