Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (19:03 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చి ఈ నోటీసులు ఇచ్చారు. 
 
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. 
 
దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం.రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఆర్థరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, తుళ్లూరులో కూడా వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాట రామారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments