Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ.. త్వరలోనే అరెస్టా?

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (19:03 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం పోలీసులు హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆర్జీవీ ఇంటికి వచ్చి ఈ నోటీసులు ఇచ్చారు. 
 
కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ వ్యూహం పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెట్టారు. 
 
దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్‌లో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం.రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం ఆర్థరాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. 
 
ఇదిలావుంటే, తుళ్లూరులో కూడా వర్మపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫోటోలను వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాట రామారావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments