Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు... మార్చి 13న రాష్ట్ర బడ్జెట్‌

అమరావతిలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి ఆరో తేదీ నుంచి శాసనసభ సమావేశాలను ప్రారంభించి 13న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1.54 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (09:31 IST)
అమరావతిలో రాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. మార్చి ఆరో తేదీ నుంచి శాసనసభ సమావేశాలను ప్రారంభించి 13న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.1.54 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. గతేడాది బడ్జెట్‌ను రూ.1.36 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. 
 
ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఆర్థిక శాఖ సమీక్ష సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. తొలుత బడ్జెట్‌ సమావేశాలను మార్చి 3 నుంచి ప్రారంభించి బడ్జెట్‌ను 6 లేదా 8వ తేదీన ప్రవేశపెట్టాలని భావించారు. దీనిపై తర్జనభర్జనలు పడిన ప్రభుత్వం తేదీలను మార్చింది.
 
ఈసారి వివిధ శాఖల నుంచి వచ్చిన బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏకంగా రూ.2 లక్షల కోట్లను దాటాయి. ఆ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెరిగే అవకాశం లేకపోవడంతో బడ్జెట్‌ కేటాయింపులకు పగ్గాలు వేయాలని ఆర్థిక శాఖ ముందు నుంచి పట్టుదలతో ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయా శాఖల బడ్జెట్‌ ప్రతిపాదనలకు భారీగా కోత వేసి రూ.1.54 లక్షల కోట్లకే కట్టడి చేసింది. బడ్జెట్‌ నిధుల కేటాయింపులో ప్రధానంగా విద్య, సంక్షేమం, జలవనరుల శాఖలదే పెద్ద పద్దుగా ఉండే సూచనలున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments