Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ పోల్ : ఓటుకు రూ.5 వేలు అయినా ఫర్లేదు...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలైనా ఇచ్చేందుకు కొంతమంది అభ్యర్థులు సిద్ధమయ్యారన్న ప్రచారం ఊపందుకొంది. 
 
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం మండలాల్లో ఓసీ, బీసీ వర్గాలకు కేటాయించిన పంచాయతీల్లో పోటీ నెలకొంది. ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో అభ్యర్థులు తమకు ఓటు పడదనే వ్యక్తికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఓటుకు రూ.5 వేలు పంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇకప్పటికే కొన్ని పంచాయతీల్లో నగదు పంపిణీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు కొందరు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో రవాణా చార్జీలు, ఖర్చులకు నగదు జమ చేయడంతోపాటు ఓటుకు రూ.3 నుంచి రూ.4 వేలు వేసినట్లు తెలిసింది. 
 
సర్పంచుగా విజయం సాధించాలనే తపనతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు పొలాలు, ప్లాట్లు వడ్డీకి తాకట్టు పెడుతుండగా, మరికొందరు ఏకంగా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments