Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ పోల్ : ఓటుకు రూ.5 వేలు అయినా ఫర్లేదు...

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో బేరసారాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా భారీగా ఓట్లను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటుకు రూ.5 వేలైనా ఇచ్చేందుకు కొంతమంది అభ్యర్థులు సిద్ధమయ్యారన్న ప్రచారం ఊపందుకొంది. 
 
ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, సీతారామపురం మండలాల్లో ఓసీ, బీసీ వర్గాలకు కేటాయించిన పంచాయతీల్లో పోటీ నెలకొంది. ఎలాగైనా విజయం సాధించాలనే ధీమాతో అభ్యర్థులు తమకు ఓటు పడదనే వ్యక్తికి, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఓటుకు రూ.5 వేలు పంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇకప్పటికే కొన్ని పంచాయతీల్లో నగదు పంపిణీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు కొందరు పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి ఇప్పటికే బ్యాంకు ఖాతాల్లో రవాణా చార్జీలు, ఖర్చులకు నగదు జమ చేయడంతోపాటు ఓటుకు రూ.3 నుంచి రూ.4 వేలు వేసినట్లు తెలిసింది. 
 
సర్పంచుగా విజయం సాధించాలనే తపనతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడడంలేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొందరు అభ్యర్థులు పొలాలు, ప్లాట్లు వడ్డీకి తాకట్టు పెడుతుండగా, మరికొందరు ఏకంగా విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments