Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (09:49 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన నిర్మాణ సామాగ్రి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. తాజాగా పిచ్చిమొక్కల మధ్య సిమెంట్ బస్తాలు బయటపడ్డాయి. ఐదేళ్లుగా ఎండకు ఎండి, వానకు తడిసి, ఎందుకూ పనికిరాకుండా పోయింది. అమరావతిలో ఏపుగా పెరిగిన మొక్కలు, చెత్తా చెదారం తొలగిస్తుండగా ఈ సిమెంట్ బస్తాలు బయటపడ్డాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 2019లో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఐదేళ్లపాటు అమరావతి వైపు ఒక్కరంటే ఒక్కరు కూడా కన్నెత్తి చూడలేదు. దీంతో పిచ్చిమొక్కలు మొలిచి, ఆ ప్రాంతమంతా అడవిలా తయారైంది. దీంతో రాజధాని నిర్మాణాల కోసం సేకరించిన సిమెంట్ బస్తాలు, ఇసుక, ఇతర సామాగ్రి అలానే ఉండిపోయి, ఎండకు ఎండి, వానకు తడిసి ఇపుడు ఎందుకూ పనికిరాకుండా పోయింది. 
 
అయితే, 2024లో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇందులోభాగంగా, ఏపుగా పెరిగిన మొక్కలు, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రం చేస్తున్నారు. దీంతో పాడైపోయిన వందలాది సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామాగ్రి బయటపడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments