Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాకు మేమే లాక్డౌన్ విధించుకుంటాం.. ఏపీలో వర్తక సంఘాల నిర్ణయం

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (18:12 IST)
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే పలు జిల్లాలలో కేసులు పెరుగుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. దీంతో వ్యాపారస్తులు కూడా దుకాణాల నిర్వహణపై ఆంక్షలు విధించుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల వర్తక సంఘాలు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి. 
 
ఇప్పటికే గుంటూరు, విజయవాడలోని వర్తక సంఘాలు నిర్ణీత సమయంలోనే షాపులు తెరుస్తామని ప్రకటించారు. అలాగే కరోనా నిబంధనలు పాటిస్తేనే వినియోగదారులను షాపుల్లోకి అనుమతిస్తామని.. షాపుల్లోనూ మాస్కులు, శానిటైజర్లు ఏర్పాటు చేయాలని వర్తక సంఘాలు సూచిస్తున్నాయి.
 
అలాగే కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు ఎలాంటి బాధ్యత వహించమని స్పష్టం చేశారు. సోమవారం నుంచి నిర్ణీత సమయంలోనే షాపులు పనిచేయనున్నాయి. గుంటూరు జిల్లాలో ఇటీవల దాదాపు నాలుగువేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 
 
జిల్లాలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సోమవారం నుండి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వ్యాపార సంస్థలు తెరిచి ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఏయే వేళల్లో వ్యాపారం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నట్లు ది ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments