Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు.. ఎక్కడో తెలుసా?

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (11:50 IST)
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయాధికారుల మొదటి సదస్సు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డైక్​మన్ ఆడిటోరియంలో జరగనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
 
రాష్ట్రంలోని 530 మంది న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేసుల సత్వర విచారణలు, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించటం, కక్షిదారులు, న్యాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి న్యాయాధికారుల సూచనలు పంచుకోవడానికి వీలుగా వీళ్లందరిని ఒకే వేదికపైకి తీసుకురావాలని... హైకోర్టు సీజే కృతనిశ్చయంతో ఉన్నారని హైకోర్టు ఇంఛార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ తెలిపారు. జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ బడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments