Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్త కష్టం: పరిశ్రమలకు 50శాతం విద్యుత్ కోత

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (22:25 IST)
power cuts
ఏపీ విద్యుత్ కోతలతో అల్లాడిపోతోంది. ఇళ్లల్లో కరెంట్ కోత ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు అధికారికంగా ప్రకటించారు. 
 
దీనితో పాటు ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరా పూర్తిగా ఆపేస్తారు. అంటే పవర్‌ హాలిడే అన్నమాట. రెండు వారాల పాటు విద్యుత్‌ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. 
 
కోవిడ్‌ తరవాత అనేక పరిశ్రమలు పని చేయడం ప్రారంభించాయని, దీంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెప్పారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా.. రోజుకు ఇంకా 40 నుంచి 50 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోందని ఏపీ ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నారు
 
ఏప్రిల్‌ 1వ తేదీన 235 మిలియన్‌ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్‌ నుంచి 64 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. గత రెండేళ్ళతో పాటు పోలిస్తే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అంటున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments