Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో తగ్గిన మద్యం ధరలు - బీరు బాటిల్‌పై రూ.30 తగ్గింపు

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (18:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా తగ్గాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.30 మేరకు తగ్గింది. అలాగే, ఇతర బ్రాండ్లపై కూడా ధరలు బాగానే తగ్గాయి. ఈ తగ్గిన ధరలు ఆదివారం నుంచే అమల్లోకి వచ్చాయి. 
 
మద్యం బ్రాండ్లపై ప్రభుత్వం వసూలు చేస్తున్న వ్యాట్, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ మార్జిన్‌ వంటి పన్నుల్లో హేతుబద్ధత తీసుకొస్తూ శనివారం రెవెన్యూ శాఖ ప్రత్యేక అదనపు కార్యదర్శి రజత్ భార్గవ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై 5 నుంచి 12 శాతం, ఇతర అన్ని కేటగిరీల మద్యంపై 20 శాతం మేరకు ధరలు తగ్గనున్నాయి. బీర్లపై 10 నుంచి 20 శాతం తగ్గనుంది. 
 
స్పెషల్ మార్జిన్ 36 శాతం, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 36 శాతం తగ్గించారు. మొత్తంగా చూసుకుంటే బీర్లపై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు తగ్గనున్నాయి. అలాగే వచ్చే వారంలో అన్ని రకాల విదేశీ బ్రాండ్లను మద్యం షాపుల్లో విక్రయానికి అందుబాటులో ఉంచనున్నారు. 

సంబంధిత వార్తలు

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

రేవ్ పార్టీలు - ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి : న‌టుడు శ్రీకాంత్

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments