Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించాను.. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానన్న యువతి.. పెట్రోల్ పోసి..?

Webdunia
బుధవారం, 16 జూన్ 2021 (13:03 IST)
ప్రేమించానని ఓ యువతి చెప్పడం.. ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని తెలపడం.. ఆ యువతి ప్రాణం తీసింది. ఓ యువకుడిని ప్రేమించానని అతన్నే పెండ్లి చేసుకుంటానని చెప్పిన ఆ యువతి పై ఆమె కుటుంబసభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన ఘటన ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా రాయచోటిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. రాయచోటి యువతికి పెండ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు కొంతకాలంగా సంబంధాలు చూస్తున్నారు. అందుకు ఆ యువతి ఒప్పుకోలేదు. మంగళవారం మరోసారి పెండ్లి విషయమై కుటుంబ సభ్యులంతా ఆమెను బలవంతపెట్టారు. 
 
నిరాకరించిన ఆ యువతి తాను ప్రేమించిన యువకుడినే పెండ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో ఆమె తల్లి, తండ్రి, సోదరుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె సోదరి, ఇరుగుపొరుగువారు వచ్చి మంటలను ఆర్పారు. గాయపడిన యువతిని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments