Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (12:37 IST)
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏపీ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలో దాటేశాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో శుక్రవారం వడగాలులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తలు నిర్వహణ శాఖ తెలిపింది. 
 
ఈ మేరకు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ప్రజల మొబైల్ ఫోన్లకు అప్రమత్తత హెచ్చరికలను పంపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 83 మండలాల్లో తీవ్ర వడగాలులు 208 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. 
 
సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. నీరు, నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి, ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని సూచన చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments