Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ 'దొంగదెబ్బ'పై హైకోర్టును ఆశ్రయించనున్న నిమ్మగడ్డ

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (13:43 IST)
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను అర్థాంతరంగా తొలగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయంపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు. ఇదే అంశంపై ఆయన న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిప ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవులు కావడంతో సోమవారం హౌస్‌మోషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
తన పదవీ కాలం మరో యేడాది ఉండగానే ప్రత్యేక ఆర్డినెన్స్‌తో చట్టంలో మార్పుచేసి మరీ తనను పదవి నుంచి తొలగించిన ఏపీ సర్కార్‌ తీరుపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అంశంపై ఆయన న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా నియమితులైన తనను దొంగదెబ్బతో తీసేయడం అన్యాయమని ఆయన అభిప్రాయపడుతున్నారు. 
 
కాగా, సీఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ జగన్‌ సర్కారు తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ హరిచందన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీన్ని ఆధారం చేసుకుని పదవీకాలం ముగిసిందన్న సాకుతో ప్రభుత్వం ఆగమేఘాల మీద నిమ్మగడ్డను తొలగిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో మద్రాసు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి కనగరాజును నియమించడం, ఆయన బాధ్యతలు స్వీకరించడం ఆగమేఘాలపై జరిగిపోయాయి. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments