Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింత వ్యాధి నుంచి బయటపడిన ఏలూరు ప్రజలు!

Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (10:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు.. అటు జాతీయ స్థాయిలో ఏలూరు పట్టణంలో వెలుగు చూసిన వింత వ్యాధి ప్రకంపనలు రేపింది. ఈ వ్యాధిబారినపడిన వందల మంది ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఏలూరు పట్టణ వాసులంతా ప్రాణభయంతో వణికిపోయారు. అయితే, ఈ వింత వ్యాధి దాదాపుగా మాయమైంది. గడచిన మూడు రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ వింత వ్యాధి నుంచి ఏలూరు బయటపడిందని ప్రకటించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
 
బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్, ఏలూరు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఇదేసమయంలో ఈ వ్యాధి సోకడానికిగల కారణాలపై ఉన్నతాధికారుల నివేదిక కూడా ప్రభుత్వానికి అందుతుంది. ఆపై వ్యాధి కారణాలను వివరించనున్న ప్రభుత్వం, ఏలూరు విముక్తమైందని ప్రకటిస్తుందని తెలుస్తోంది. 
 
కాగా, ఇటీవల వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు పట్టణంలో కలుషిత నీరు తాగడం వల్లే ఈ వ్యాధి సంభవించిందని, రక్తంలో పరిమాణానికి మించి లోహాలు చేరడమే ప్రజలను అస్వస్థతకు గురిచేసినట్టు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌కు చెందిన నిపుణులతో కూడిన వైద్య బృందం తేల్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments