Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు చంపేస్తారనీ.. దళిత యువకుడి ఆత్మహత్య...

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2020 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతలు బెదిరింపులకు భయపడి తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని  పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు గ్రామం బండకాడపల్లి  దళితవాడకు చెందిన ఓం ప్రతాప్ అనే యువకుడు మద్య నిషేధం పేరుతో జగన్ రెడ్డి చేస్తున్న దోపిడీ గురించి సోషల్ మీడియాలో తన ఆవేదనను వెళ్లగక్కాడు. 
 
జగన్ రెడ్డి బ్రాండ్లు, అధిక రేట్లతో పేదలను ఏ విధంగా దోచుకుంటున్నారో ఓం ప్రతాప్ వివరించాడు. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించినందుకు మమల్ని దోచుకుంటావా జగన్ రెడ్డి అంటూ యువకుడు ప్రశ్నించాడు. నాలుగైదు రోజుల క్రితం మదనపల్లిలో ఓ వైన్ షాపు వద్ద ఓం ప్రతాప్ తన ఆవేదనను వెళ్లగక్కుతూ పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ఆ జిల్లాకు చెందిన మంత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప మనుషులు బెదిరింపులకు దిగినట్టు సమాచారం. పైగా చంపేస్తాం అంటూ ఫోనులో బెదిరిస్తూ వేధించినట్టు వినికిడి. వారి వేధింపులు భరించలేని ఓం ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments